World Public Services

Telugu News for change makers

20071025

చెత్త మీద రూ.22 కోట్లు మిగులు

ఢిల్లీ నగరంలో చెత్త ఏరుకునేవారు ఢిల్లీ ప్రభుత్వానికి ఏటా రూ.22 కోట్లను ఆదా చేస్తున్నారని అసోఛామ్ ఐఎల్ఎఫ్ అండ్ ఎస్ ఎకోస్మార్ట్ అధ్యయనం తెలిపింది. ప్రభుత్వం సేకరించే దానికన్నా చెత్త ఏరుకునేవారే ఎక్కువగా చెత్త సేకరిస్తున్నారని, నగరంలోని సాలిడ్ వేస్ట్‌లో 17 శాతాన్ని చెత్త ఏరుకునేవారు సేకరించి, వేరు చేసి ఉచితంగా రవాణా చేస్తున్నారని అధ్యయనం తెలిపింది. ఈ అనియత చెత్త వ్యాపారం కారణంగా ప్రభుత్వానికి రోజుకు ఆరు లక్షల రూపాయలు ఆదా అవుతున్నాయని అధ్యయనం పేర్కొంది. మున్సిపల్ సాలిడ్‌వేస్ట్‌లో అధిక భాగాన్ని ఏ జాగ్రత్తలు పాటించకుండానే లోతట్టు ప్రాంతాలలో పారవేస్తున్నారని కూడా అధ్యయనంలో ఉంది. భారతదేశంలో ఉత్పత్తయే ప్లాస్టిక్ వృధాలో 40 నుంచి 80 శాతాన్ని రీసైకిల్ చేస్తున్నారని, అభివృద్ధి చెందిన దేశాలలో ఈ రిసైక్లింగ్ రేటు 10 నుంచి 15 శాతం మాత్రమేనని అధ్యయనం తెలిపింది.

Labels: , ,