World Public Services

Telugu News for change makers

20071106

చట్టపరిధిలోకి మొబైల్ ఫోన్ టవర్లు

మొబైల్ ఫోన్ టవర్లు హానికరమైన ఎలక్ట్రోమేగ్నటిక్ రేడియేషన్‌ను వెలువరిస్తుండటంతో వాటిని క్రమబద్ధీకరిస్తూ చట్టాన్ని రూపొందించమని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. సెల్యులార్ సర్వీసు ప్రొవైడర్లకు చెందిన 3,000 టవర్లు నగరంలో ఉన్నాయి. ప్రతి రోజు ఒకటి లేదా రెండు టవర్ల స్థాపన జరుగుతూనే ఉంది. టవర్ల నుండి వెలువడే రేడియేషన్ స్థాయి డేటాపై ఖచ్చితమైన ప్రమాణాలు ఇప్పటి వరకు లేవు. దీనికి సంబంధించి ఎటువంటి చట్టం లేకపోవడంతో ప్రభుత్వం ఏ రకమైన చర్యా తీసుకోలేక పోతోంది.

Labels: , , ,

20071104

సమస్యలను పట్టించుకోని సెల్‌ఫోన్ సంస్థలు

సెల్‌ఫోన్ సంస్థలు వినియోగదారుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఇండియా మొబైల్ సర్వీసెస్ (ఐబీఎస్) సర్వే నిర్వహించి తేల్చింది. సెల్‌ఫోన్ సంస్థలు వినియోగదారుల కోసం రూపొందించే కస్టమర్ కేర్ సర్వీస్ (సీసీఎస్) కేంద్రాలు తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయని పెదవి విరిచింది.
సర్వే అధ్యయన ప్రధానాంశాలివి.
* వినియోగదారులు తమ ఫిర్యాదులపై సీసీఎస్ నుంచి సంతృప్తికర సమాధానం పొందాలంటే కనీసం ఆరు నిమిషాలు పడుతోంది.
* దేశంలో 11 సెల్ సంస్థలున్నా, వినియోగదారులకు సంతృప్తికరమైన సమాధానాలిచ్చే వాటిని వేళ్లమీద లెక్కబెట్టవచ్చు.
* టెలిఫోన్ రెగ్యులేట్ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వినియోగదారుల సేవలకు సంబంధించి అనేక విధివిధానాలు నిర్దేశించింది. అయితే ప్రొవైడర్లు వాటిని అందుకోలేకపోతున్నారు.
* సేవల వైఫల్యానికి అపరిమితంగా పెరుగుతున్న వినియోగదారుల సంఖ్య కూడా కారణమే.
* వీటిపై ప్రభుత్వం తగిన చర్యలు చేపడితేనే వినియోగదారులకు ఆశించిన స్థాయిలో సేవలు అందుతాయి.

Labels: ,