World Public Services

Telugu News for change makers

20080212

ఢిల్లీలో నో స్మోకింగ్‌ బోర్డు తప్పనిసరి

ఢిల్లీ లోని రెస్టారెంట్లు, గెస్టు హౌస్‌ల ముందు 'నో స్మోకింగ్‌ ఏరియా' బోర్డును తప్పనిసరిగా ప్రదర్శించాలని ఢిల్లీ పోలీసులకు వాణిజ్య సంస్థలకు హెచ్చరికలు జారీచేశారు. లేనట్త్లెతే యజమానులు రూ.500 జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. 1996 ఢిల్లీ ప్రొహిబిషన్‌ ఆఫ్‌ స్మోకింగ్‌, నాన్‌స్మోకర్స్‌ హెల్త్‌ సంరక్షణ చట్టం కింద నగరంలోని హోటళ్ళు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, ఈటింగ్‌ హౌస్‌లు, గెస్టు హౌస్‌లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ చట్టంలోని 10వ సెక్షన్‌ ప్రకారం ప్రజలు ఎక్కువగా వచ్చే ఆయా సంస్థల వద్ద ఉండే ముఖ్యమైన ప్రదేశాలు లేదా రాకపోకల గేట్ల వద్ద నో స్మోకింగ్‌ జోన్‌, పొగ తాగటం నేరం అనే బోర్డులు ఉండాలి. ఈ నిబంధనను ఉల్లంఘించిన వ్యక్తికి మొదటిసారి రూ.100, రెండోసారి రూ.200 జరిమానాగా చెల్లించాలి. ఈ జరిమానా రూ.500 వరకు పొడిగించవచ్చు.
డీయూలో ఫిబ్రవరి నెల 15 నుంచి ధూమపాన నిషేధం అమలు
ఢిల్లీ యూనివర్సిటీలో ఫిబ్రవరి 15 నుంచి ధూమపాన నిషేధం అమలు చేయనున్నారు. ఈ మేరకు అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లకు సర్క్యులర్లు జారీ చేశారు. పొగ తాగకూడదనే సందేశాన్ని వీధి నాటకాలు ప్రదర్శించడం, గోడలపై పెయింటింగ్‌లు, పోస్టర్లను అతికించడం ద్వారా ప్రచారం చేస్తున్నారు. క్యాంపస్‌ సమీపంలో సిగరెట్లను విక్రయించే దుకాణదారులను పంపించి వేశామని యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు అమృత బహ్రి అన్నారు. మొదటిసారి ఈ నియమాన్ని ఉల్లంఘించిన వారిపై రూ.200 జరిమానా విధిస్తారు. రెండో సారి ఉల్లంఘిస్తే రూ.500 వరకు ఫైన్‌ వేస్తారు.

0 Comments:

Post a Comment

<< Home