World Public Services

Telugu News for change makers

20071029

ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ఖర్చు 41.76 శాతం

జీతాలు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వ  ఉద్యోగులు వాపోతుంటే.. ప్రభుత్వం  వారిపై పెడుతున్న ఖర్చును బాగా తగ్గించుకునే సన్నాహాల్లో ఉంది. 12వ ఆర్థిక సంఘం సూచన ప్రకారం 2009-10కి రాష్ట్ర రెవెన్యూ వ్యయంలో జీతాల వాటా 35 శాతానికి తగ్గాలి. 2005-06 ఆడిట్ లెక్కల ప్రకారం ఈ వాటా 41.76 శాతంగా ఉంది. ఆ ఏడాది వడ్డీ, పింఛను చెల్లింపులు కాకుండా జీతభత్యాల రూపేణా రూ.10,455 కోట్లు ఖర్చయ్యింది. జీతాల వ్యయం వాటాను ఏటా తగ్గించుకుంటూ మరో రెండేళ్లలో 35 శాతం లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది.

Labels:

0 Comments:

Post a Comment

<< Home